లక్నో: ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగులు, ఇతర సిబ్బంది సమ్మెలపై నిషేధాన్ని యూపీ ప్రభుత్వం మరో ఆరు నెలలపాటు పొడిగించింది. ఎసెన్షియల్ సర్వీసెస్ మెయింటెనెన్స్ యాక్ట్ (ఎస్మా)ను ప్రయోగించిన తర్వాత ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రజా సేవలు, కార్పొరేషన్లు, స్థానిక అధికారుల సమ్మెలపై మరో ఆరు నెలల పాటు నిషేధం పొడిగించిందని ప్రభుత్వ అధికారిక ప్రతినిధి ఒకరు తెలిపారు. గతేడాది మే నెలలో ఆరు నెలల కాలానికి రాష్ట్ర ప్రభుత్వం మొదట ఎస్మాను ప్రయోగించింది. నవంబర్ 25న మరో ఆరు నెలలపాటు ఎస్మాను పొడిగించింది. ఇప్పుడు మరో ఆరు నెలలకు ఆ నిషేధాన్ని పెంచింది.