లక్నో: కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్న నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. యూపీలోని కొవిడ్ పేషెంట్లందరికీ ఫ్రీగా రెమ్డెసివర్ ఇంజక్షన్లను ప్రభుత్వమే ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. రాష్ట్రంలోని ప్రభుత్వం, ప్రైవేట్ హాస్పిటల్స్లో చేరే అందరికీ ఇది వర్తిస్తుంది. ప్రభుత్వం నడిపే హాస్పిటల్స్కు రాష్ట్ర ప్రభుత్వమే ఈ ఇంజక్షన్లను సరఫరా చేస్తుంది. అయితే ప్రైవేట్ హాస్పిటల్స్ మాత్రం రెమ్డెసివిర్ను కంపెనీల నుంచి కొనుక్కోవాల్సి ఉంటుంది.
ఒకవేళ మార్కెట్లో దొరకకపోతే, పేషెంట్కు ఆ ఇంజెక్షన్ తప్పనరిసరి అయితే వాళ్లకు కూడా డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్, చీఫ్ మెడికల్ ఆఫీసర్లే ఇంజెక్షన్ను అందించాల్సి ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. డిమాండ్కు తగినట్లుగా అన్ని జిల్లాలకు తగినన్ని రెమ్డెసివిర్ వియల్స్ను అందుబాటులో ఉంచాలని సీఎం యోగి ఆదేశించారు. అవసరమైతే ప్రైవేట్ హాస్పిటల్స్కు నిర్ణీత ధరకు అందించాలని నిర్ణయించారు. యూపీకి కేంద్రం కూడా రెమ్డెసివిర్ కోటా పెంచింది. మొత్తం లక్షా 61 వేల వియల్స్ ఇవ్వనుంది.