ఉత్తరప్రదేశ్లోని లఖింపుర్ ఖేర్లో ఆదివారం కేంద్ర మంత్రి కాన్వాయ్ కారు దూసుకెళ్లడం వల్ల నలుగురు మృతిచెందిన విషయం తెలిసిందే. ఆ తర్వాత జరిగిన ఘర్షణల్లో మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. అదే ఘటనతో లింకు ఉన్న ఓ జర్నలిస్టు ఇవాళ మృతిచెందారు. అయితే లఖింపుర్ ఖేర్ ఘటనలో మృతిచెందిన నలుగురు రైతు కుటుంబాలకు యూపీ ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించింది. ఒక్కొక్క మృతుడి కుటుంబానికి రూ.45 లక్షలు ఇవ్వనున్నారు. లఖింపుర్ ఖేర్లో గాయపడ్డ వారికి ఒక్కొక్కరికి 10 లక్షలు ఇవ్వనున్నట్లు యూపీ సర్కార్ ప్రకటించింది. రైతులు ఇచ్చే ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయనున్నట్లు ఏడీజీ ప్రకాంత్ కుమార్ తెలిపారు. లఖింపుర్ ఖేర్ హింసపై రిటైర్డ్ హైకోర్టు జడ్జితో దర్యాప్తు చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు.