హైదరాబాద్: మసాజ్ సెంటర్ పేరుతో వ్యభిచారం నిర్వహిస్తున్న ఒక ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఖైరతాబాద్ షాదన్ కాలేజీ ఎదురుగాగల చింతలబస్తీ రోడ్డులోని ఒక గృహంలో మసాజ్ సెంటర్ పేరుతో బ్యూటీపార్లర్ అండ్ స్పా కొనసాగుతున్నది. అక్కడి మసాజ్ కోసం వెళ్లిన వారిని వ్యభిచారంలోకి దింపుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దాంతో సైఫాబాద్ పోలీసులు ఆ మసాజ్ సెంటర్పై రైడింగ్ చేసి ముఠా గుట్టును రట్టు చేశారు.
ఆదివారం రాత్రి 11:30 గంటలకు రాంగోపాల్పేట ఇన్స్పెక్టర్ చంచల్ బాబు, సైఫాబా ద్కు చెందిన ఇద్దరు ఎస్ఐలు, పలువురు సిబ్బంది మసాజ్ సెంటర్పై రైడింగ్కు వెళ్లారు. ముందుగా ఒక కానిస్టేబుల్ను పంపి బేరం కుదుర్చుకున్నాక, వ్యభిచారం జరుగుతున్నదని నిర్ధారించుకుని పోలీసులు రైడ్ చేశారు. సెంటర్ నిర్వాహకులు హీనా తబస్సుమ్, జైనబ్ తబస్సుమ్తోపాటు విటులు మొయినుద్దీన్, పుర్కాన్ అలీ, సాజిద్ ఆలీ, మొయిన్ మహబూబ్ హుస్సేన్లను అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురు యువతులను రెస్క్యూ హోమ్కు తరలించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
తెలుగు ప్రజలకు రాష్ట్రపతి, ప్రధాని ఉగాది శుభాకాంక్షలు
దేశంలో కరోనా విలయం.. కొత్తగా 1.61లక్షల కేసులు
‘స్పుత్నిక్ వి’కి డీసీజీఐ గ్రీన్సిగ్నల్
రెండు కాళ్లు, మూడు చేతులతో.. ఒడిశాలో జన్మించిన అవిభక్త కవలలు
రాబోయే ఐదు రోజులు రాష్ట్రంలో వర్షాలు
ఎఫ్ 3 చిత్రంలో వకీల్ సాబ్ బ్యూటీ..!