పెళ్లిరోజునే రక్తదానం చేసిన వధూవరులు

లక్నో: నవ దంపతులు రక్తదానం చేసి ప్రాణ దాతలు అయ్యారు. ఓ యువతి ప్రాణాలు కాపాడటానికి కొత్తగా వివాహం చేసుకున్న జంట పెళ్లి రోజునే రక్తదానం చేసి ఆదర్శంగా నిలిచింది. ఆపదలో ఉన్న యువతి కోసం రక్తదానం చేసి మానవత్వం చాటుకున్న వధూవరులను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. నూతన జంట రక్తదానం చేసిన విషయాన్ని ఉత్తర్ప్రదేశ్ పోలీస్ ఆశీష్ మిశ్రా ట్విటర్లో పంచుకున్నారు. ఈ జంటను ప్రశంసిస్తూ మిశ్రా నవదంపతుల ఫొటోను షేర్ చేశారు.
ఈ ఫొటోలో వరుడు రక్తం దానం చేస్తుండగా అతని భార్య అతని పక్కన నిలబడి ఉంది. దీనికి సంబంధించిన ఫొటో సోషల్మీడియాలో వైరల్గా మారింది. ఓ యువతి ప్రాణాపాయస్థితిలో ఉండగా ఆమెకు రక్తదానం చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఈ విషయం తెలియగానే కొత్త దంపతులు పెళ్లి దుస్తుల్లోనే ఆస్పత్రికి వచ్చి సహాయం చేశారు.
मेरा भारत महान |
— Ashish Kr Mishra (@IndianCopAshish) February 22, 2021
एक बच्ची को ब्लड की जरूरत थी,कोई भी रक्तदान करने को सामने नही आ रहा था, क्योंकि वो किसी दूसरे की बच्ची थी,अपनी होती तो शायद कर भी देते,
खैर, शादी के दिन ही इस जोड़े ने रक्तदान कर बच्ची की जान बचायी |
Jai Hind,#PoliceMitra #UpPoliceMitra #BloodDonation pic.twitter.com/tXctaRe1nR
తాజావార్తలు
- ప్రముఖ తెలుగు రచయిత్రి పెయ్యేటి దేవి ఇకలేరు
- మార్చి 4 నుంచి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఐదో దశ పరీక్షలు
- నేడు ఎంజీఆర్ మెడికల్ వర్సిటీ స్నాతకోత్సవం.. ప్రసంగించనున్న ప్రధాని
- 60 వేల నాణెలతో అయోధ్య రామాలయం
- నానీని హగ్ చేసుకున్న ఈ బ్యూటీ మరెవరో కాదు..!
- సర్కారు పెరటి కోళ్లు.. 85 శాతం సబ్సిడీతో పిల్లలు
- కరోనా కట్టడికి నైట్ కర్ఫ్యూ
- గోమాతలకు సీమంతం.. ప్రత్యేక పూజలు
- కూతురి కళ్లెదుటే.. తండ్రిని కత్తులతో పొడిచి చంపారు
- ‘పెట్రో’ ఎఫెక్ట్.. రూ.12 పెరగనున్న పాల ధర!