లక్నో: రాష్ట్రంలో అర్హులైన వారందరికి కరోనా వ్యాక్సిన్ అందిస్తామని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. ప్రస్తుతం 18 ఏండ్లు పైబడినవారికి టీకా పంపిణీ కొనసాగుతున్నదని, త్వరలోనే 12 నుంచి 18 ఏండ్లలోపువారికి వ్యాక్సినేషన్ ప్రారంభిస్తామని చెప్పారు. ప్రతి ఒక్కరికి టీకా అందిస్తామని వెల్లడించారు.
ఉత్తరప్రదేశ్లో నిన్న 3,723 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 16,77,508కి చేరింది. ఇందులో 69,828 కేసులు యాక్టివ్గా ఉండగా, 15,88,161 మంది కోలుకున్నారు. మరో 19,519 మంది బాధితులు మృతిచెందారు.
దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతున్నది. ఇప్పటివరకు 20 కోట్లకుపైగా మందికి కరోనా టీకా పంపిణీ చేవారు. దీంతో అమెరికా తర్వాత ఈ మైలురాయిని దాటిన రెండో దేశంగా భారత్ నిలిచిందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అమెరికా 124 రోజుల్లో ఈ ఘణతను సాధించగా, దేశంలో 130 రోజులు పట్టింది.