కోల్కతా: పశ్చిమ బెంగాల్ ఎన్నికలకు బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి పోలీసు బలగాలను మోహరించడాన్ని నిలిపివేయాలని తృణమూల్ కాంగ్రెస్ కోరింది. ఈ మేరకు బుధవారం ఎన్నికల కమిషన్కు టీఎంసీ లేఖ రాసింది.
ఉత్తరప్రదేశ్ నుంచి రాష్ట్ర సాయుధ పోలీసుల 30 కంపెనీలను పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు నియమించాలని ఆదేశించినట్లు తెలిసింది. బీజేపీ పాలిత రాష్ట్రమైన యూపీ నుంచి పోలీసులను ఇక్కడి ఎన్నికల్లో మోహరిస్తే ఏకపక్షంగా వ్యవహరించే అవకాశం ఉన్నదని ఎన్నికల కమిషన్కు రాసిన లేఖలో టీఎంసీ తెలిపింది.
‘బీజేపీయేతర రాష్ట్రాల నుంచి సాయుధ పోలీసులను మోహరించడాన్ని తాము వ్యతిరేకించడం లేదని, అయితే, యూపీకి చెందిన ఎస్ఏపీసిబ్బందిని మోహరించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే ఇది యూపీ పోలీసులు అక్కడి ప్రభుత్వం చెప్పుచేతల్లో ఉంటుంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.. బీజేపీ స్టార్ క్యాంపెయినర్గా కూడా ఉన్నారు. ఈ చర్య ఎన్నికల యంత్రాంగం నిష్పాక్షికతను తీవ్రంగా దెబ్బతీస్తుంది’ అని టిఎంసి ఆందోళన వ్యక్తం చేసింది.
యూపీతోపాటు మరే ఇతర బీజేపీ పాలిత రాష్ట్రం నుంచి పశ్చిమ బెంగాల్కు సాయుధ పోలీసుల మోహరింపును వెంటనే ఆపాలని ఎన్నికల కమిషన్కు కోరుతున్నాం అని పార్టీ తెలిపింది.
రాష్ట్రంలోని 294 అసెంబ్లీ స్థానాలకు మార్చి 27 నుంచి ఏప్రిల్ 29 వరకు ఎనిమిది దశల్లో ఎన్నికలు జరుగనున్నాయి. మే 2 న ఫలితాలు ప్రకటించనున్నారు.
బిట్ కాయిన్తో టెస్లా కారు కొనొచ్చు.. ఎలోన్ మస్క్ ట్వీట్
త్వరలో క్యాన్సర్ వ్యాధికి టీకా.. జర్మన్ శాస్త్రవేత్త దంపతుల దృష్టి
పరంబీర్ పిటిషన్ విచారణకు నిరాకరించిన సుప్రీంకోర్టు
క్షయవ్యాధికి కారకాన్ని గుర్తించిన రాబర్ట్ కోచ్.. చరిత్రలో ఈరోజు
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.