పాట్నా: బీహార్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్, సెంట్రల్ టెట్ ఉత్తీర్ణుల డిమాండ్కు తాను మద్దతిస్తున్నట్లు రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) నేత తేజ్ ప్రతాప్ యాదవ్ తెలిపారు. వారికి న్యాయం జరిగే వరకు తాను కూడా నిరసన తెలుపుతానని అన్నారు. బీహార్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (BTET), సెంట్రల్ టెట్ (CTET) ఉత్తీర్ణులైన అభ్యర్థులు పాట్నాలో నిరసన చేపట్టారు. 2019 డిసెంబర్లో CTET ఉత్తీర్ణులైన వారిని తప్పనిసరిగా ప్రభుత్వ ఉపాధ్యాయులుగా నియమించాలి. అయితే ఈ నియామకానికి సంబంధించి వారు ఇంతవరకు అపాయింట్మెంట్ లెటర్లు పొందలేదు. ఈ నేపథ్యంలో నిరసనకు దిగిన అభ్యర్థులకు తేజ్ ప్రతాప్ యాదవ్ మద్దతు తెలిపారు. వారిని కలిసిన ఆయన, న్యాయం జరిగే వరకు తాను కూడా నిరసన చేస్తానని చెప్పారు.