బాలీవుడ్ ప్రముఖ నటుడు రణధీర్ కపూర్ కరోనా బారిన పడ్డారు. ఆయనకు కరోనా పాజిటివ్ అని తెలియగానే అందరిలో ఆందోళన మొదలైంది. ప్రస్తుతం 74 ఏళ్ల రణధీర్ ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు తెలుస్తుంది. ఎవరు కంగారు పడొద్దని వైద్యులు చెబుతున్నారు. తనతో పాటు తన స్టాఫ్ ఐదుగురికి కరోనా సోకిందని తెలియజేసిన రణధీర్ ముందస్తు జాగ్రత్తగా ఆసుపత్రిలో చేరారని అంటున్నారు. తనకు ఎలాంటి ఇబ్బంది లేదని అంటున్న రణధీర్ ఆక్సీజన్ సాయం కూడా తీసుకోవట్లేదని పేర్కొన్నారు. రణధీర్ ఇటీవలే రెండో డోస్ వ్యాక్సిన్ తీసుకున్నారు
రాజ్ కుమార్ తనయుడు అయిన రణ్ధీర్ కపూర్ గత ఏడాది ఏప్రిల్ 30న తన సోదరుడు రిషీ కపూర్ను కోల్పోయాడు. రెండేళ్లుగా క్యాన్సర్తో పోరాడిన రిషి ఏప్రిల్ 30న కన్నుమూసారు. ఇక ఈ ఏడాది ఫిబ్రవరి 9న రణధీర్ చిన్న తమ్ముడు రాజీవ్ కపూర్ మరణించారు. 1971లో వచ్చిన ‘కల్ ఆజ్ అవుర్ కల్’ చిత్రంతో రణధీర్ హీరోగా పరిచయం అయ్యారు. చివరిగా హౌజ్ఫుల్ 2 అనే చిత్రంలో నటించారు.