ఛండీగఢ్: దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ముమ్మరంగా కొనసాగుతున్నది. ఇందులో భాగంగా కేంద్ర మంత్రి సోమ్ ప్రకాశ్ కరోనా టీకా తీసుకున్నారు. సోమవారం ఉదయం ఛండీగఢ్లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ (పీజిప్మర్)లో వ్యాక్సిన్ రెండో డోసు వేయించుకున్నారు. ఆయన దేశవ్యాప్తంగా రెండో విడత వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభమైన మార్చి 1న టీకా మొదటి డోసు తీసుకున్నారు. ప్రధాని మోదీ కూడా కరోనా టీకా రెండో డోసును ఢిల్లీ ఎయిమ్స్లో ఈనెల 8న వేయించుకున్నారు.
దేశవ్యాప్తంగా టీకా మహోత్సవం కొనసాగుతున్నది. వ్యాక్సిన్ పంపిణీని వేగవంతం చేయడంలో భాగంగా చేపట్టిన ఈ కార్యక్రమం నిన్న ప్రారంభమయ్యింది. మరో రోజులపాటు జరగనున్న ఈ కార్యక్రమంలో అర్హులలో సాధ్యమైనంత ఎక్కువ మందికి టీకా అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే వ్యాక్సిన్ నిల్వలు లేకపోవడంతో కొన్ని రాష్ట్రాల్లో టీకా పంపిణీ ఆగిపోయిన విషయం తెలిసిందే.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..