కేంద్రమంత్రి శ్రీపాద్ నాయక్కు రోడ్డు ప్రమాదం.. భార్య దుర్మరణం

అంకోలా (కర్ణాటక): కేంద్ర మంత్రి శ్రీపాద్ నాయక్కు సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలయ్యాయి. కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలో ఎల్లాపుర నుంచి గోకర్ణకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.
అంకోలా తాలూకా హోసాకంబీ గ్రామం వద్ద వారు ప్రయాణిస్తున్న కారు బోల్తా పడింది. కేంద్ర మంత్రి శ్రీపాద్ నాయక్, ఆయన భార్య విజయ, వ్యక్తిగత కార్యదర్శి దీపక్ దూబే, మరొకరు తీవ్రంగా గాయ పడ్డారు.
విజయ తలకు తీవ్ర గాయమైంది. కాగా, వారిని చికిత్స కోసం సమీప ప్రభుత్వ దవాఖానకు తరలించగా ఆయన భార్య విజయ, వ్యక్తిగత కార్యదర్శి దీపక్ మరణించారని పోలీసులు ధ్రువీకరించారు.
తీవ్రంగా గాయపడిన కేంద్ర మంత్రి శ్రీపాద్ నాయక్కు ప్రాథమిక చికిత్స తర్వాత మెరుగైన వైద్య సేవల కోసం గోవాకు తరలించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని తెలుస్తున్నది.
కాగా, ప్రధాని నరేంద్రమోదీ.. గోవా సీఎం ప్రమోద్ సావంత్తో మాట్లాడారు. నాయక్ చికిత్స కోసం తగు ఏర్పాట్లు జేయాలని ఆదేశించారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా ప్రమాదం పట్ల విచారం వ్యక్తం చేశారు. శ్రీపాద్ నాయక్ త్వరితగతిన కోలుకోవాలని ఆకాంక్షించారు. అవసరమైతే శ్రీపాద్ నాయక్ను తరలించడానికి ప్రత్యేక ఎయిర్ అంబులెన్స్ ను అందుబాటులోకి తెస్తామని చెప్పారు.
శ్రీపాద్ నాయక్, తన భార్య పిల్లలతో కలిసి యెల్లాపూర్లోని గంటే గణపతి దేవాలయాన్ని శుక్రవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. తిరిగి గోకర్ణకు రాత్రి ఏడు గంటలకు బయలుదేరారు.
మార్గమధ్యలో ఎన్హెచ్-63 నుంచి సబ్ రోడ్డు.. గోకర్ణకు అడ్డదారికి వారు ప్రయాణిస్తున్న ఎస్యూవీ కారును మళ్లించారు. ఈరోడ్డు పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. దీంతో కారు అదుపు తప్పి బోల్తా పడింది. మంత్రి భార్య విజయ, వ్యక్తిగత కార్యదర్శి దీపక్ దూబే, మరొక వ్యక్తి గాయపడ్డారు. అంకోలా పోలీసులు కేసు నమోదు చేశారు.
కర్ణాటకలో కేంద్రమంత్రి శ్రీపాద్ నాయక్కు రోడ్డు ప్రమాదం.. భార్య దుర్మరణం pic.twitter.com/8YDAV66YXa
— Namasthe Telangana (@ntdailyonline) January 11, 2021
కేంద్ర మంత్రి శ్రీపాద్ నాయక్కు త్రుటిలో ప్రమాదం తప్పింది. కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలో పర్యటనకు వెళ్లినప్పుడు రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆయన భార్య, వ్యక్తిగత కార్యదర్శి దీపక్ తీవ్రంగా గాయపడ్డారు pic.twitter.com/XMW9JJzjj3
— Namasthe Telangana (@ntdailyonline) January 11, 2021
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- పునర్జన్మలపై నమ్మకమే మదనపల్లి హత్యలకు కారణం !
- అధికార పార్టీకి దురుద్దేశాలు అంటగడుతున్నారు : మంత్రి పెద్దిరెడ్డి
- పార్లమెంట్ మార్చ్ వాయిదా : బీకేయూ (ఆర్)
- ఢిల్లీ సరిహద్దులో గుడారాలు తొలగిస్తున్న రైతులు
- హెచ్-1 బీ నిపుణులకు గ్రీన్ కార్డ్.. షార్ట్కట్ రూటిదే?!
- యువత క్రీడాస్ఫూర్తిని చాటాలి : మంత్రి మల్లారెడ్డి
- ఇద్దరు గ్రామస్తులను హతమార్చిన మావోయిస్టులు
- రేపు ఏపీ గవర్నర్ను కలవనున్న బీజేపీ, జనసేన బృందం
- పవన్ కళ్యాణ్కు చిరు సపోర్ట్..జనసేన నేత కీలక వ్యాఖ్యలు
- భారత్ చేరిన మరో మూడు రాఫెల్స్