హైదరాబాద్, జూన్ 17:ప్రముఖ ఔషధాల తయారీ సంస్థ నాట్కో ఫార్మా నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో సంస్థ రూ.53 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.93 కోట్లతో పోలిస్తే 43 శాతం తక్కువ ఇది. 2019-20 నాలుగో త్రైమాసికంలో రూ.477 కోట్లుగా ఉన్న కంపెనీ ఆదాయం..గత త్రైమాసికంలో రూ.360 కోట్లకు పడిపోయి ంది. 2020-21లో రూ.2,156 కోట్ల ఆదాయంపై రూ.442 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది.