న్యూఢిల్లీ, జూలై 22: వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో నిరసన తెలియజేస్తున్న రైతులను కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి గూండాలతో పోల్చారు. విలేకరులతో మాట్లాడుతూ ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు దుమారం రేపాయి. దీంతో తన వ్యాఖ్యలను వక్రీకరించారంటూ ఆమె ట్విట్టర్లో తెలిపారు.