జగిత్యాల, మే 17 : సీఎంఆర్ఎఫ్ ఎందరికో బాసటగా నిలుస్తున్నదని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పేర్కొన్నారు. జగిత్యాల అర్బన్, రూరల్ మండలాలకు చెందిన 41మంది లబ్ధిదారులకు మంజూరైన రూ.12లక్షల విలువైన సీఎం సహాయనిధి చెక్కులను లబ్ధిదారులకు సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గతంలో సీఎం సహాయనిధి ద్వారా ఇంత మంది లబ్ధిపొందిన దాఖలాలు లేవని, తెలంగాణ ప్రభుత్వం సీఎం సహాయనిధిపై ప్రత్యేక చొరవ చూపుతూ నిరుపేదలకు అండగా నిలిచిందన్నారు. సంక్షోభ సమయంలోనూ పథకాలు ఆపకుండా సీఎం కేసీఆర్ అండగా ప్రజలకు అండగా నిలుస్తున్నారన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ పాలెపు రాజేంద్రప్రసాద్, టీఆర్ఎస్ జిల్లా యూత్ అధ్యక్షుడు దావ సురేశ్, రైతుబంధు అర్బన్ మండల కన్వీనర్ జుంబర్తి శంకర్, పీఏసీఎస్ చైర్మన్ సందీప్ రావు, సర్పంచులు గంగారాం, నారాయణ గౌడ్, ప్రభాకర్, బోనగిరి నారాయణ, మహేశ్వర రావు, ఎంపీటీసీ మహేశ్, ఉప సర్పంచ్ బొడ్డు బుచ్చన్న, ఏఎంసీ డైరెక్టర్ రవి, నాయకు లు కట్ల రాజేందర్, అంజన్న, రవి, రాజు గౌడ్, కుడుకల లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.