ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రేపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి నారాయణ్ రాణె( Narayan Rane ) అరెస్ట్ తప్పేలా లేదు. అరెస్ట్ తప్పించుకోవడానికి ఆయన వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను రత్నగిరి కోర్టు తిరస్కరించింది. స్వాతంత్ర్య దినోత్సవం రోజున ప్రసంగించిన ఉద్ధవ్ థాక్రేకు మన దేశానికి ఏ ఏడాది స్వాతంత్ర్యం వచ్చిందో కూడా తెలియదని, తాను అక్కడ ఉండి ఉంటే థాక్రేను లాగిపెట్టి కొట్టి ఉండేవాడినని నారాయణ్ రాణె కామెంట్ చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై సోమవారం రాత్రి నుంచి శివసేన, బీజేపీ మధ్య యుద్ధం నడుస్తోంది. మంగళవారం ఉదయం రెండు పార్టీల కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. ఈ వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రిపై ఇప్పటికే పలు ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి.