భోపాల్: కేంద్ర పౌర విమానయాన మంత్రి, బీజేపీ నేత జ్యోతిరాదిత్య సింధియా తాను వాడిన మాస్క్ను ఒక వ్యక్తికి తొడిగారు. మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో ఆయన పర్యటన సందర్భంగా ఈ ఘటన జరిగింది. గ్వాలియర్ ఎంపీ అరుణ్ మిశ్రా మాస్క్ లేకుండా ఉండటాన్ని సింధియా గమనించారు. దీంతో ఆయన వెంటనే ఎన్95 మాస్క్పైన వేసుకున్న మరో సర్జికల్ మాస్క్ను తీసి మిశ్రాకు తొడిగారు. ఈ సమయంలో అక్కడ ఉన్న ఒక కెమెరామేన్ తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
మరోవైపు మధ్యప్రదేశ్లోని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ దీనిపై విమర్శలు చేసింది. రాజకీయ ర్యాలీల కోసం అధికార పార్టీ లక్షలు ఖర్చుచేస్తుండగా, ఆ పార్టీకి చెందిన కేంద్ర మంత్రి వాడిన మాస్క్లు పంచుతున్నారని ఎద్దేవా చేసింది.