కర్రలతో కొట్టాలని ప్రజలకు కేంద్రమంత్రి గిరిరాజ్ పిలుపు
పాట్నా/బెగుసరై, మార్చి 7: పని చేయని ప్రభుత్వ అధికారులకు బడితె పూజ చేయాలని కేంద్రమంత్రి గిరిరాజ్సింగ్ ప్రజలకు పిలుపునిచ్చారు. శనివారం ఆయన తన నియోజకవర్గమైన బెగుసరైలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ‘ఏదైనా పనిమీద అధికారుల వద్దకు వెళ్లితే పనులు జరుగడం లేదని చాలా మంది నాకు ఫిర్యాదులు చేస్తున్నారు. నాకు ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేదు. మీ పనిలో నిజాయితీ ఉంటే అధికారిని నిలదీయండి. అయినా పని చేసిపెట్టకుంటే కర్రలతో కొట్టండి’ అని సూచించారు. ఈ వ్యాఖ్యలను బీహార్ సీఎం నితీశ్కుమార్ వద్ద విలేకరులు ప్రస్తావించగా.. ‘నన్ను ఎందుకు అడుగుతున్నారు.. అధికారులపై ఎవరైతే వ్యాఖ్యలు చేశారో ఆయననే అడగండి’ అని నితీశ్ పేర్కొన్నారు.