వైభవంగా నిత్యకల్యాణం
ఖజానాకు రూ. 1,76,868 ఆదాయం
కొనసాగనున్న ఆలయ వేళల మార్పు
యాదాద్రి, ఏప్రిల్ 30 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి దివ్యక్షేత్రంలో శుక్రవారం లక్ష్మీపూజలు శాస్ర్తోక్తంగా జరిగాయి. అర్చక బృందం బాలలాయంలో కవచమూర్తులను సువర్ణ పు ష్పాలతో ఆర్చించి, వేదమంత్రాలతో అభిషేకించారు. తులసీద ళాలు, కుంకుమలతో ప్రత్యేక పూజలు చేపట్టారు. మొదటగా శ్రీ మన్యుసూక్త పారాయణం జరిపారు. ప్రత్యేకంగా బంగారంతో తయారు చేసిన 108 పుష్పాలను శ్రీవారి సన్నిధిలో ఉంచి అర్చ న జరిపారు. సాయంత్రం బాలాలయంలో ఆండాళ్ అమ్మవారి ని దివ్య మనోహరంగా అలంకరించి వేదమంత్ర పఠనాల నడు మ ఊంజల్ సేవ నిర్వహించారు. ముత్తయిదువలు మంగళ హా రతులతో అమ్మవారిని స్థుతిస్తూ పాటలు పాడుతు సేవ ముందు నడిచారు. తిరువీధి సేవ అనంతరం అమ్మవారిని బాలాలయం ముఖమంటపంలోని ఊయలలో శయనింపు చేయించారు. గంట పాటు వివిధ రకాల పాటలతో అమ్మవారిని కొనియాడు తూ లాలిపాటల కోలాహలం సాగింది.
వైభవంగా నిత్యకల్యాణం..
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి బాలాలయంలో లక్ష్మీ నృసింహులను దివ్య మహోహరంగా ఆలకరించి తిరు నిత్య క ల్యాణోత్సవం అర్చకులు అత్యంత వైభవంగా జరిపారు. మొద టగా సుదర్శన నారసింహహోమం శాస్ర్తోక్తంగా నిర్వహించారు. స్వామివారికి రోజూవారి నిత్యారాధనలు ఆగమశాస్త్ర రీతిలో వై భవంగా జరిగాయి. వేకువజామున సుప్ర భాతంతో ఆరంభించి న నిత్యవిధి కైంకర్యాలు రాత్రి శయనోత్సవ వేడుకలతో ముగిశా యి. మండపంలో ఉత్సవమూర్తులను పంచామృతాలతో అభిషే కించి తులసీదళాలతో అర్పించారు. ఆలయంలో అష్టోత్తరం, సువర్ణ పుష్పార్చనలు కొనసాగాయి. యాదాద్రి కొండకింద శిల్పారామంలో భక్తులు సత్యనారాయణ వ్రతమాచరించి కొం డపైన స్వామిని దర్శించుని మొక్కులు చెల్లించున్నారు.
స్వామివారిని దర్శించుకున్న మంత్రి ఎర్రబెల్లి
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారిని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, తెలంగాణ రాష్ట్ర పారిశ్రా మిక మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ తదితరులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, అధికారులు వారికి స్వామివారి ఆశీర్వచ నం, ప్రసాదం అందజేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయ కులు కాంటెకార్ పవన్కుమార్, అలయ సిబ్బంది పాల్గొన్నారు.
ఖజానాకు రూ. 1,76,868 ఆదాయం
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారికి రూ. 1,76,868 ఆదా యం సమకూరిందని ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్ ద్వారా రూ. 9,562, రూ. 100 దర్శనాల తో రూ. 1,500, కైంకర్యాల ద్వారా రూ. 400, సుప్రభా తంతో రూ. 200, క్యారీబ్యాగులతో రూ. 900, వ్రతాలతో రూ. 7,000, కల్యాణకట్టతో రూ. 8,800, ప్రసాద విక్రయాలతో రూ. 90, 060, వాహన పూజలతో రూ. 5,300, టోల్ గేట్ ద్వారా రూ. 300, అన్నదాన విరాళంతో రూ. 5,116, సువర్ణ పుష్పార్చనతో రూ. 11,620, యాదరుషి నిలయంతో రూ. 17,350, శివాల యంతో రూ. 2,000, పాతగుట్టతో రూ. 2,250, టెంకాయల ద్వారా రూ. 9,510, ఇతర విభాగాలతో రూ. 5,000 తో కలిపి స్వామివారికి రూ. 1,76,868 ఆదాయం సమకూరింది.