న్యూఢిల్లీ : కొవిడ్-19 సంక్షోభం ఆసరాగా మహమ్మారి పేరుతో దండుకునేందుకు కాంగ్రెస్ పార్టీ తహతహలాడుతోందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ పంజాబ్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. పంజాబ్ లో పాలక కాంగ్రెస్ సర్కార్ పై ప్రైవేట్ దవాఖానలకు వ్యాక్సిన్ల విక్రయం జరుగుతోందని వచ్చిన ఆరోపణల నేపథ్యంలో కేంద్ర మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజలు విధిగా ప్రైవేట్ దవాఖానల వద్ద వ్యాక్సిన్లను కొనుగోలు చేసే పరిస్థితి కల్పిస్తోందని అనురాగ్ ఠాకూర్ ఆరోపించారు.
రూ 400 విలువైన వ్యాక్సిన్ ను రెండు డోసులకు రూ 3120లకు విక్రయిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు ప్రభుత్వంపై ఆరోపణలు వెల్లువెత్తిన క్రమంలో 18-44 ఏండ్ల మధ్యవయసు వారికి ప్రైవేట్ దవాఖానల ద్వారా ఒకసారి పరిమిత వ్యాక్సిన్ డోసులకు సంబంధించి జారీ చేసిన ఉత్తర్వులను పంజాబ్ సర్కార్ ఉపసంహరించింది.పంజాబ్ ప్రభుత్వం ప్రైవేట్ దవాఖానలకు లాభాలకు వ్యాక్సిన్లను అమ్మడంపై హైకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరిపించాలని ఎస్ఏడీ చీఫ్ సుఖ్బీర్ సింగ్ బాదల్ డిమాండ్ చేశారు.