కొత్తపల్లి, ఏప్రిల్ 24: ప్రభుత్వ ఆదేశాల మేర కు ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేస్తున్న కొత్తపల్లి పట్టణానికి చెందిన ఉపాధ్యాయులకు డీసీఎంఎస్ వైస్ చైర్మన్ ఎండీ ఫక్రొద్దీన్ శనివారం రేషన్ బియ్యాన్ని పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభు త్వం ప్రైవేట్ ఉపాధ్యాయులను ఆదుకొనేందుకు వారికి రూ.2వేలు, 25కిలోల సన్న బియ్యం పంపిణీ చేస్తుందన్నారు. కౌన్సిలర్లు చింతల సత్యనారాయణరెడ్డి, గండు రాంబా బు, మానుపాటి వేణుగోపాల్, జడ్పీ మాజీ కో ఆప్షన్ సభ్యుడు ఎండీ జమీలొద్దీన్, నాయకులు ఎస్కే బాబా, కట్ల సుధాకర్ ఉన్నారు. అంగన్వాడీ కేంద్రంలో బాలింతలు, గర్భిణులకు పౌష్టికాహారాన్ని అందించారు.
అందరికీ సాయమందించాలి
తెలంగాణచౌక్, ఏప్రిల్ 24: రాష్ట్రంలోని ప్రైవేట్ పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులందరికీ ఆర్థికసాయం అందించాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి కసిరెడ్డి మణికంఠరెడ్డి కోరారు. మార్చి 2020 రిజష్టర్లో నమోదైన టీచర్లందరికీ రూ.2వేలు, 25 కిలోల బియ్యం ఇవ్వాలని, ఎలాంటి ఆంక్షలు విధించవద్దన్నారు. పాఠశాలల మూసివేసినందున వారిని ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు.