ఢిల్లీ,జూన్ 3: ప్రధానమంత్రి అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ సుస్థిర నగరాభివృద్ధికి సంబంధించి భారతప్రభుత్వ అర్బన్ వ్యవహారాల మంత్రిత్వశాఖకు, జపాన్ ప్రభుత్వానికి చెందిన భూ, మౌలికసదుపాయాలు, రవాణా,పరర్యాటక మంత్రిత్వశాఖ మధ్య ఒప్పందానికి ఆమోదం తెలిపింది. నగరాభివృద్ధికి సంబంధించి 2007 లో కుదిరన ఎం.ఒ.యు స్థానంలో ఈ ఎం.ఒ.యు ఉంటుంది.
అమలు వ్యూహం: ఎం.ఒ.సి కింది తగిన వ్యూహాన్ని రూపొందించి, సహకారానికి సంబంధించిన అమలుకు ఒక సంయుక్త వర్కింగ్ గ్రూప్( జె.డబ్ల్యు.ఒ)ను ఏర్పాటు చేయడం జరుగుతుంది.ఈ సంయుక్త వర్కింగ్ గ్రూపు ఏడాది కి ఓ సారి జపాన్ లోను ఆ తర్వాత ఇండియాలోనూ సమావేశమౌతుంది.ఈ ఎం.ఒ.సిపై సంతకం అయిన రోజునుంచి సహకారం ప్రారంభమౌతుంది. ఇది ఐదేండ్లు కొనసాగుతుంది. ఆ తర్వాత మరో ఐదేండ్లు దీనిని ఆటోమేటిక్గా కొనసాగించవచ్చు.ఈ ఎంఒ.సి ఈ రెండు దేశాల మధ్య బలమైన , దీర్ఘకాలిక ద్వైపాక్షిక సహకారాన్ని సుస్థిర నగరాభివృద్ధికి ప్రోత్సహిస్తుంది.
ఈ ఒప్పందం వల్ల ప్రయోజనాలు…
ఈ ఎం.ఒ.సుస్థిర నగర అభివృద్ధి, పట్టణ ప్రణాళిక, స్మార్ట్ సిటీ అభివృద్ధి, చౌక గృహ నిర్మాణం, (రెంటల్ హౌసింగ్) అర్బన్ ఫుడ్ మేనేజ్మెంట్, మురుగునీటిపారుదల, ఘన వ్యర్ధాల నిర్వహణ, నగర రవాణా (ఇంటెలిజెంట్ ట్రాన్స్పోర్టు మేనేజ్మెంట్ సిస్టమ్, ట్రాన్సిట్ ఒరియంటెడ్ డవలప్మెంట్,, మల్టీమోడల్ ఇంటిగ్రేషన్), విపత్తులను తట్టుకునే అభివృత్థా రంగాలలో ఉపాధి అవకాశాలను కల్పించనుంది.ఇండియా,జపాన్ మధ్య సాంకేతిక సహకారాన్ని సుస్థిర నగరాభివృద్ధి, నగర ప్రణాళిక, స్మార్ట్సిటీల అభివృద్ధి, చౌక గృహ నిర్మాణం,అద్దె ఇళ్లు,నగర వరద నిర్వహణ, మురికినీటిపారుదల, ఘన వ్యర్థాల నిర్వహణ, ఇంటెలిజెంట్ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ , ట్రాన్సిట్ నిర్దేశిత అభివృద్ధి, మల్టీమోడల్ ఇంటిగ్రేషన్, విపత్తులను తట్టుకునే రీతిలో అభివృద్ధి, ఇంకా ఇరుపక్షాలూ పరస్పరం గుర్తించిన అంశాలలో మరింత బలోపేతం చేయడం.