అంగన్వాడీలు, రైతు వేదికలకూ నీటి సౌకర్యం
నల్లా కనెక్షన్ పనులు షురూ..పలుచోట్ల పూర్తి
మంత్రి హరీశ్రావు ఆదేశాలతో ముమ్మరంగా పనులు
ప్రభుత్వ చర్యలపై అన్నివర్గాల్లో హర్షం
ఇప్పటికే సంగారెడ్డి జిల్లాలో 2,39,987 కనెక్షన్ల ద్వారా తాగునీటి సరఫరా
సంగారెడ్డి మార్చి 29 (నమస్తే తెలంగాణ):ప్రజల తాగునీటి కష్టాలు తీర్చేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మిషన్ భగీరథ’ పథకం సత్ఫలితాలిస్తున్నది. ఊరూరా.. ఇంటింటికీ నల్లా కనెక్షన్ల ద్వారా తాగునీరు సరఫరా అవుతుండడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నివాసాలతో పాటు బడులు, ఆలయాలు, మసీదులు, చర్చిలు, అంగన్వాడీలు, రైతు వేదికలకు సైతం నీటి సౌకర్యాన్ని కల్పించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించడంతో ఆ దిశగా అధికారులు పనులు ముమ్మరం చేశారు. సంగారెడ్డి జిల్లాలో ఇప్పటికే 944 నివాస ప్రాంతాలకు 2,39,987 నల్లా కనెక్షన్ల ద్వారా మంచినీటిని సరఫరా చేస్తుండగా, తాజాగా సర్కారు నిర్ణయం మేరకు అన్ని చోట్లా త్వరలోనే నల్లా కనెక్షన్లు ఇస్తామని పేర్కొంటున్నారు.
మిషన్ భగీరథ పథకం సీఎం కేసీఆర్ కల. ఇంటింటికీ తాగునీరు అందించేందుకు జిల్లాలోని ప్రతి ఇంటికీ మిషన్భగీరథ ద్వారా తాగునీటి నల్లా కనెక్షన్లు ఇచ్చారు. ఫలితంగా ప్రజల తాగునీటి కష్టాలు తొలిగి స్వచ్ఛమైన నీటిని తాగుతున్నారు. జిల్లాలోని ఇప్పటికే 944 నివా స ప్రాంతాలకు 2,39,987మంచినీటి కనెక్షన్ల ద్వారా సరఫరా చేస్తున్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ ప్రభు త్వం గుడులు, బడులకు సైతం ఉచిత నల్లా కనెక్షన్లను అందజేస్తోంది. జిల్లాలోని ఆలయాలు, ప్రార్థనా మందిరాలతోపాటు ప్రభుత్వ సంస్థలైన బడులు, రైతు వేదికలు, అంగన్వాడీ పాఠశాలల భవనాలకు సైతం నల్లా కనెక్షన్లు ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. దీంతో మిషన్ భగీరథ అధికారులు నల్లా కనెక్షన్లు ఇస్తున్నారు. ఇటీవల మంత్రి హరీశ్రావు మిషన్ భగీరథ పథకం అమలుపై అధికారులతో సమీక్ష జరిపారు. జిల్లాలో వేగంగా నల్లా కనెక్షన్లు ఇవ్వాలని ఆదేశించడంతో అధికారులు పనులు ప్రారంభించారు. త్వరలోనే నల్లా కనెక్షన్లు ఇవ్వడం పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు. మంచినీటి సరఫరాలో భవిష్యత్లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇందుకోసం జిల్లాలో మెయిన్ గ్రిడ్కు 2003.97 పైపులైన్, ఇంట్రాగ్రిడ్కు 2768.87 కిలోమీటర్ల మేర పైపులైన్లను గ్రామగ్రామానికి అనుసంధానం చేశారు. దీంతో భవిష్యత్లో మంచినీటి సమస్య తలెత్తకుండా ప్రభుత్వం శాశ్వత పరిష్కారానికి శ్రీకారం చుట్టింది.
ఆలయాలు, ప్రార్థనా మందిరాలకు నల్లా కనెక్షన్లు
ప్రతి ఆలయం, ప్రార్థనామందిరాల్లో నీటి సౌకర్యం తప్పనిసరి. ఆలయాలు, ప్రార్థనా మందిరాల్లో దైవ సంబంధమైన కార్యక్రమాలు నిర్వహించేముందు నీళ్లు అవసరం ఉంటుంది. సంగారెడ్డి నియోజకవర్గంలోని కొన్ని ఆలయాలు, ప్రార్థనామందిరాల్లో మాత్రమే బోరు సౌకర్యం ఉంది. చాలా ఆలయాలు, ప్రార్థనా మందిరాల్లో నీటికోసం ఇబ్బందులు పడాల్సివస్తోంది. దీనిని గమనించి ప్రభుత్వం ఆలయాలు, ప్రార్థనా మందిరాలకు సైతం నీటిని సరఫరా చేయాలని నిర్ణయం తీసుకుంది.
అంగన్వాడీ కేంద్రాలు, రైతువేదికలకు…
కొత్తగా నిర్మించిన రైతువేదికలకు వచ్చే రైతులకు మిషన్ భగీరథ ద్వారా నల్లా కనెక్షన్లు ఏర్పాటు చేస్తుంది. అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే విద్యార్థులకు మిషన్ భగీరథ ద్వారా తాగునీరు సరఫరా చేస్తున్నా రు. జిల్లాలో మొత్తం 1296 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా ఇప్పటివరకు 1294 అంగన్వాడీ కేంద్రాలకు తాగునీటి కనెక్షన్లు ఇచ్చారు. జిల్లాలో 116 రైతువేదికలను నిర్మించగా ఇప్పటివరకు 112 రైతువేదికలకు కనెక్షన్లు ఇవ్వడం పూర్తి అయ్యింది. ఇంకా నాలుగు రైతువేదికలకు కనెక్షన్లు ఇవ్వాల్సి ఉంది.
బడులకు తాగునీటి నలాలకనెక్షన్లు
ప్రభుత్వ పాఠశాలల్లో నల్లా కనెక్షన్లు ఇస్తుంది. జిల్లా లో మొత్తం 1287 పాఠశాలలు ఉండగా ఇప్పటి వర కు 917 పాఠశాలలకు నల్లా కనెక్షన్లు ఇచ్చారు. ఇంకా 370 పాఠశాలలకు పనులు కొనసాగుతున్నాయి.
త్వరలోనే పూర్తి చేస్తాం
జిల్లాలోని అన్ని జనావాసాలకు మిషన్ భగీరథ ద్వారా నల్లా కనెక్షన్లు ఇవ్వడం 95శాతం పూర్తి అయ్యింది. ప్రభుత్వ ఆదేశాలతో త్వరలో దేవాలయాలు, ప్రార్థనా మందిరాలకు సైతం మిషన్ భగీరథ ద్వారా నల్లా కనెక్షన్లు ఇవ్వడం ప్రారంభించాం. జిల్లాలోని 1133 ఆలయాలు, ప్రార్థనా మందిరాలకు వందశాతం నల్లా కనెక్షన్లు ఇస్తాం. పనులు వేగంగా జరిగేలా చర్యలు ప్రారంభించాం. జిల్లాలోని రైతువేదికలు, అంగన్వాడీ కేంద్రాలకు నల్లా కనెక్షన్లు ఇవ్వడం 90 తం పూర్తి అయ్యింది. ప్రభుత్వ పాఠశాలలకు నల్లా కనెక్షన్లు ఇవ్వడం త్వరలోనే పూర్తి చేస్తాం.
ఇవి కూడా చదవండి
టీవీ చూస్తూ స్నాక్స్ తింటున్నారా.. జాగ్రత్త..!
వేసవిలో నిత్యం ఈ పండ్లను తప్పనిసరిగా తినాల్సిందే ఎందుకంటే..?