మైక్రోబయాలజిస్ట్ బసిక ప్రశాంత్రెడ్డి వెల్లడి
హైదరాబాద్, మే 19 (నమస్తే తెలంగాణ): వార్తల్లో వస్తున్నట్టు సింగపూర్లో కొత్త వేరియంట్కు సంబంధించి ఎలాంటి జన్యుక్రమాన్ని అధికారికంగా విశ్లేషించలేదని సింగపూర్లో మైక్రోబయాలజిస్ట్గా పనిచేస్తున్న బసిక ప్రశాంత్రెడ్డి తెలిపారు. సింగపూర్ వేరియంట్ ప్రబలుతున్నదని, చిన్న పిల్లలపై ఎక్కువగా ప్రభావం చూపుతున్నదని వస్తున్న వార్తల నేపథ్యంలో ఆయన స్పందించారు. సింగపూర్ వేరియంట్ అంటూ వార్తలు రాయొద్దని, అసలు సింగపూర్ వేరియంట్ అనేదే నిజం కాదని వివరించారు. బీ.1.617, ఇతర వేరియంట్ల వ్యాప్తి తీవ్రంగా ఉందని, ఈ రకాన్ని ‘వేరియంట్ ఆఫ్ కన్సర్న్’గా భావించి అందర్నీ జాగ్రత్తగా ఉండాలని మాత్రమే సింగపూర్ ప్రభుత్వం చెప్పిందని వెల్లడించారు. సింగపూర్లో ఉంటున్న తమ బంధువులు, స్నేహితుల గురించి భారతీయులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రశాంత్రెడ్డి చెప్పారు.