ఎల్బీనగర్, మే 31 : వ్యాక్సినేషన్ కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. సోమవారం చైతన్యపురిలోని గణేశ్ ఫంక్షన్ హాల్ను సందర్శించి సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతిరోజు వెయ్యి మంది వ్యాక్సిన్ వేసుకునేందుకు వస్తున్న నేపథ్యంలో నిత్యం వ్యాక్సిన్ కేంద్రాన్ని పిచికారీ చేయాలన్నారు. జయచంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్టు ద్వారా తాగునీటి బాటిళ్లను పంపిణీ చేస్తున్నామన్నారు. ఆయన వెంట సరూర్నగర్ సర్కిల్ ఉప కమిషనర్ హరి కృష్ణయ్య, నాయకులు అనంతుల రాజారెడ్డి, చంద్రశేఖర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మన్సూరాబాద్, మే 31: నాగోల్ డివిజన్ పరిధిలోని శుభం కన్వెన్షన్ హాల్లో నిత్య సేవకుల కోసం ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ కేంద్రాన్ని సోమవారం ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. వ్యాక్సినేషన్ కేంద్రాల్లో ఎప్పటికప్పుడు సోడియం హైపో క్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేయించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జీహెచ్ఎంసీ హయత్నగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ మారుతి దివాకర్, ఏఎంహెచ్ఓ మంజులవాణి, నాయకులు అనంతుల రాజిరెడ్డి, అనిల్చౌదరి, చింతల రవికుమార్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.