న్యూఢిల్లీ: దేశంలో బ్రిటన్, దక్షిణ ఆఫ్రికా, బ్రెజిల్ స్ట్రెయిన్ కరోనా కేసుల సంఖ్య 213కు చేరిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇందులో 187 బ్రిటన్ స్ట్రెయిన్, ఆరు బ్రెజిల్ స్ట్రెయిన్, దక్షిణ ఆఫ్రికా స్ట్రెయిన్కు చెందిన ఒక కేసు ఇప్పటి వరకు నిర్ధారణ అయ్యినట్లు చెప్పింది.
వీటిలో ఎక్కువ వ్యాప్తి కలిగించేది బ్రిటన్ స్రెయిన్ కరోనా వైరస్ అని, అందుకే ఈ కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్నదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇకపై ఈ దేశాల నుంచి భారత్ వచ్చే ప్రయాణికులకు విస్తృతంగా కరోనా పరీక్షలు నిర్వహిస్తామని తెలిపింది. దీని కోసం తాజాగా మార్గదర్శకాలు జారీ చేసినట్లు వెల్లడించింది.