న్యూఢిల్లీ: యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల కోసం అభ్యర్థులు పీహెచ్డీ పూర్తి చేసుండాలనే నిబందనను కేంద్ర ప్రభుత్వం సవరించింది. యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ ఈ చట్టాన్ని 2018లో చేసింది. ఈ ఏడాది జూలై నుంచి దీన్ని అమలు చేయాలని భావించింది. అయితే కరోనా కారణంగా ఈ నిర్ణయం వాయిదా పడుతూ వచ్చింది. ఈ క్రమంలో తాజా నిబంధన అమలును 2023 జూలై వరకూ వాయిదా వేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అప్పటి వరకూ యూజీసీ నెట్ స్కోరు ఆధారంగానే నియామకాలు జరుగుతాయని యూజీసీ ఒక ప్రకటనలో వెల్లడించింది. ‘‘కరోనా పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని పీహెచ్డీ తప్పనిసరి నిబంధన అమలును 2021 జూలై నుంచి 2023 జూలై వరకూ వాయిదా వేయాలని నిర్ణయించాం’’ అని యూజీపీ ప్రకటన పేర్కొంది.