హైదరాబాద్ : రాష్ట్ర రోడ్లు, భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఆయన సతీమణి నీరజా రెడ్డి సోమవారం హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్లో కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు.
కరోనా వైరస్ను ఎదుర్కోవడానికి ప్రతి ఒక్కరూ కొవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలని మంత్రి సూచించారు. ప్రజలకు వ్యాక్సిన్ పట్ల అపోహలు అవసరం లేదన్నారు. వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదని తెలిపారు.
మంత్రి వెంట నిమ్స్ డైరెక్టర్ మనోహర్, సూపరింటెండెంట్ సత్యనారాయణ, డాక్టర్ గంగాధర్, డాక్టర్ రమేష్ తదితరులు ఉన్నారు.