ఢిల్లీ : కొవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో యూజీసీ నేషనల్ ఎలిజబిలిటీ టెస్ట్(నెట్) పరీక్ష షెడ్యూల్ వాయిదా పడింది. మే 2 నుండి 17వ తేదీ వరకు జరిగే ఈ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పొక్రియాల్ మంగళవారం తెలిపారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఉత్తర్వుల ప్రకారం పరీక్షకు కనీసం 15 రోజుల ముందు ఎగ్జామ్ షెడ్యూల్ను ప్రకటించనున్నారు. ప్రస్తుత కొవిడ్ ఉధృతి కారణంగా విద్యార్థుల ఆరోగ్యాలను దృష్టిలో ఉంచుకుని యూజీసీ నెట్ డిసెంబర్ 2020 షెడ్యూల్ను (మే 2021)ను వాయిదా వేసినట్లు పోక్రియాల్ పేర్కొన్నారు.