హైదరాబాద్, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగా): సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ తెలుగు ప్రజలకు మంగళవారం ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ‘తెలుగు ప్రజలందరికీ శ్రీ ప్లవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మీరంతా ఆయురారోగ్యాలు, సుఖశాంతులతో సంతోషంగా ఉండాలని నేను, నా కుటుంబసభ్యులు కోరుకుంటున్నాం’ అని పేర్కొన్నారు.