బీహార్ ఎన్నికల్లో ఉద్దవ్ థాకరే ప్రచారం!

ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్ థాకరే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తన పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేయనున్నారు. ఉద్ధవ్ థాకరేతోపాటు ఆయన తనయుడు ఆదిత్య థాకరే సైతం బీహార్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. గత ఏడాది మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు విషయంలో బీజేపీతో విడిపోయిన శివసేన ఈ సారి బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 50 స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల ప్రచారం తదితర అంశాలపై కసరత్తు చేస్తున్నది.
యాభై స్థానాల్లో ఒంటరిగా పోటీ చేయాలని భావిస్తున్న శివసేన ఇప్పటికే 22 మంది అభ్యర్థుల పేర్లతో తొలి జాబితా విడుదల చేసింది. మిగతా 28 స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నది. కాగా, బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఉద్ధవ్ థాకరే, ఆదిత్య థాకరేతోపాటు శివసేన పార్టీకి చెందిన పలువురు సీనియర్ నేతలు సుభాష్ దేశాయ్, సంజయ్ రౌత్, అనిల్ దేశాయ్, వినాయక్ రౌత్, అరవింద్ సావంత్, ప్రియాంక చతుర్వేది, రాహుల్ షెవాలే, కృపాల్ తుమానే కూడా పాల్గొననున్నారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- రైతు నేత రాకేశ్ తికాయత్ నిరాహార దీక్ష
- కాశీ గంగా హారతిలో పాల్గొన్న సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులు
- 'థ్యాంక్ యూ బ్రదర్' ట్రైలర్ రివ్యూ..!
- సీఎం కేసీఆర్ ప్రతి ఆలోచన ప్రజల అభివృద్ధి కోణంలోనే
- ఖమ్మం నగరాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతాం
- బ్రాండ్ బెస్ట్లో జియోకు ఐదో స్థానం.. కోకాకోలాకు ఫోర్త్ ర్యాంక్
- సూపర్స్టార్ జాకీచాన్ తో దిశాపటానీ
- ఏపీలో కొత్తగా 117 కరోనా పాజిటివ్ కేసులు
- నిజాంసాగర్కు పూర్వవైభవం తెస్తాం
- బీజేపీలో చేరిన పుదుచ్చేరి మాజీ మంత్రి