ఉదయ్పూర్: రాజస్థాన్లోని ఉదయ్పూర్కు చెందిన తాంత్రికుడు భలేశ్ కుమారుడు ఓ జంటను అత్యంత దారుణంగా చంపేశాడు. కేలబావిడి అడవిలో ఆ జంటకు చెందిన నగ్న శరీరాలను పోలీసులు గుర్తించారు. మర్డర్ జరిగిన మూడు రోజుల తర్వాత ఆ మృతదేహాలను గుర్తించారు. పోలీసుల కథనం ప్రకారం..
తొలుత పోలీసులు ఆ మర్డర్ను.. ఓ పరువు హత్యగా భావించారు. కులాలు వేరు కావడంతో వాళ్లు ఆ అనుమానం వ్యక్తం చేశారు. కానీ ఈ కేసులో ఓ తాంత్రికుడిని అదుపులోకి తీసుకున్న తర్వాత అది మర్డర్ అని తేలింది. చనిపోయిన వారిని 30 ఏళ్ల టీచర్ రాహుల్, 28 ఏళ్ల సోను కున్వార్గా గుర్తించారు. పోలీసుల ప్రకారం రాహుల్, కున్వర్లు అక్రమ సంబంధంలో ఉన్నారు.
భవది గుడాలోని ఇచ్చాపూర్ణ శేషనాగ్ భావ్జీ మందిర్లో భలేశ్ ఓ మాంత్రికుడు. అతని వద్దకు రాహుల్, సోను ఫ్యామిలీలు వచ్చేవాళ్లు. ఆ సమయంలో ఈ ఇద్దరి మధ్య పరిచయం పెరిగింది. అయితే ఈ పరిచయం తర్వాత రాహుల్ తన భార్యతో తరుచూ గొడవ పడేవాడని తెలిసింది. రాహుల్, సోను మధ్య అక్రమ సంబంధం ఉన్న విషయాన్ని ఆ తాంత్రికుడు రాహుల్ భార్యకు తెలిపాడు. దీంత ఆగ్రహానికి గురైన రాహుల్.. భలేశ్ను చంపేస్తానని బెదిరించాడు. అప్పుడు తన పరువు పోతుందన్న ఉద్దేశంతో భలేశ్ ఆ జంటను చంపాలని ప్లాన్ వేశాడు.
రాహుల్, సోనును చంపేందుకు 50 ట్యూబ్ల ఫెవిక్విక్ తెచ్చి ఓ డబ్బాలో నింపాడు. నవంబర్ 15వ తేదీన ఆ జంటను అడవికి రమ్మన్న భలేశ్.. తన ముందే ఆ ఇద్దర్ని శృంగారంలో పాల్గొనమని చెప్పాడు. అయితే ఆ జంట శృంగారంలో పాల్గొన్న సమయంలో.. డబ్బా నిండ ఉన్న ఫెవిక్విక్ను వారిపై పోశాడు. వాళ్లు అభ్యంతరకర భంగిమలో ఉన్న సమయంలో చంపేస్తే, తనపై అనుమానం రాదని భలేశ్ భావించినట్లు పోలీసులు చెప్పారు.
ఫెవిక్విక్ పోసిన తర్వాత ఆ ఇద్దరూ వేరుపడేందుకు తీవ్రంగా శ్రమించారని పోలీసులు తెలిపారు. ఆ ప్రయత్నంలో ఆ ఇద్దరి మర్మాంగాలు దెబ్బతిన్నాయన్నారు. అయితే ఆ సమయంలోనే ఆ ఇద్దరిపై భలేశ్ కత్తితో దాడి చేసి చంపేశాడు.
సుమారు 50 సీసీటీవీ ఫూటేజ్లను పరిశీలించి, దాదాపు 200 మందిని ప్రశ్నించామని ఉదయ్పూర్ ఎస్పీ వికాశ్ కుమార్ తెలిపారు. జంట మర్డర్లో తాంత్రికుడు భలేశ్ హస్తం ఉన్నట్లు తెలుసుకుని అతన్ని అరెస్టు చేశారు. విచారణ సమయంలో ఆ నేరం చేసినట్లు భలేశ్ అంగీకరించాడు.