చైనా రాకెట్పై అమెరికా రక్షణ శాఖ హెచ్చరిక
న్యూఢిల్లీ, మే 8: చైనా గత నెల 29న ప్రయోగించిన లాంగ్ మార్చ్ 5బీ రాకెట్ ఆదివారం ఉదయం 4.30 గంటల సమయంలో తుర్క్మెనిస్థాన్లో కూలిపోవచ్చని అమెరికా రక్షణ శాఖ అంచనా వేసింది. 8 టన్నుల బరువు ఉన్న ఈ రాకెట్ అంతరిక్షం నుంచి వస్తున్న దిశ, వేగాన్ని బట్టి ఈ నిర్ణయానికి వచ్చింది. తుర్క్మెనిస్థాన్లో జనసమ్మర్ధం ఉన్న ప్రాంతంలోనే రాకెట్ భూమిని తాకవచ్చని హెచ్చరించింది. అయితే నియంత్రణ కోల్పోయి వస్తున్న ఈ రాకెట్ ఏ ప్రాంతంలో పడుతుందన్నది కచ్చితంగా అంచనా వేయలేకపోయింది. గంటకు దాదాపు 30వేల కిలోమీటర్ల వేగంతో భూమివైపునకు దూసుకువస్తున్న ఈ రాకెట్ను అమెరికా స్పేస్ కమాండ్ నిరంతరం గమనిస్తున్నది. గత నెలలో ప్రయోగించిన ఈ రాకెట్ నిర్ణీత ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టిన తర్వాత నియంత్రణ కోల్పోయింది. మరోవైపు, రాకెట్ భూమి మీద పడే అవకాశం లేదని, అది భూ వాతావరణంలోకి రాగానే మండిపోతుందని చైనా పేర్కొన్నది.