శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. బందిపొరా జిల్లాలోని షోక్బాబా అటవీప్రాంతంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నారన్న సమాచారం మేరకు శనివారం భద్రతాబలగాలు గాలింపు చేపట్టాయి. వీరిరాకను గుర్తించిన ముష్కరులు కాల్పులకు తెగబడటంతో బలగాలు ఎదురుకాల్పులు జరిపాయి. దీంతో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఓ జవాన్కు గాయాలయ్యాయి. మరోవైపు సరిహద్దులోని నియంత్రణ రేఖ వెంట విధులు నిర్వర్తిస్తున్న ఓ జవాన్ పొరపాటున మందుపాతరపై కాలు పెట్టడంతో అది పేలి ఆయన మరణించారు.