ముంబై: మహారాష్ట్రలో కరోనా మహమ్మారి బీభత్సం సృష్టిస్తున్నది. రోజురోజుకు కొత్తగా నమోదయ్యే కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతున్నది. గత మూడు రోజులుగా ఏ రోజు కూడా 50 వేలకు తగ్గకుండా కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఇక రాజధాని ముంబైలోనైతే పరిస్థితి మరింత దారుణంగా ఉన్నది. సాధారణ జనంతోపాటే కరోనా బారినపడి మరణిస్తున్న పోలీసుల సంఖ్య కూడా ముంబైలో రోజురోజుకు పెరుగుతున్నది. తాజాగా ముంబైకి చెందిన మరో ఇద్దరు పోలీసులు కరోనా కాటుకు బలయ్యారు. దాంతో ముంబైలో ఇప్పటివరకు కరోనా సోకి మరణించిన పోలీసుల సంఖ్య 105కు చేరింది.