న్యూఢిల్లీ, ఏప్రిల్ 27: కియా ఇండియా మంగళ వారం నూతన లోగోను ఆవిష్కరించింది. దక్షిణ కొరియాకు చెందిన ఈ ఆటో రంగ సంస్థ.. భారత్లో తమ బ్రాండ్ రూపాన్ని మార్చేసింది. ‘మూమెంట్ దట్ ఇన్ స్పైర్స్’ నినాదంతో ఈ సరికొత్త లోగోను కియా పరిచయం చేసింది. ఇక కార్ల తయారీపైనేగాక అడ్వాన్స్డ్, ఎకో-ఫ్రెండ్లీ మొబిలిటీ సొల్యూ షన్స్ను అందించడంపైనా దృష్టి పెడుతామని చెప్పింది.