తిరువనంతపురం: కేరళలో జికా వైరస్ చాప కింద నీరులా విస్తరిస్తూనే ఉంది. ప్రతిరోజూ క్రమం తప్పకుండా ఒకటి రెండు కేసులు నమోదవుతూనే ఉన్నాయి. తాజాగా ఇవాళ కూడా ఇద్దరిలో జికా వైరస్ బయటపడింది. దాంతో ఆ రాష్ట్రంలో మొత్తం జికా వైరస్ కేసుల సంఖ్య 21కి పెరిగింది. మంగళవారం పూంతూర గ్రామానికి చెందిన ఓ 35 ఏండ్ల వ్యక్తిలో, శాస్తమంగళం గ్రామానికి చెందిన 41 ఏండ్ల వ్యక్తిలో జికా వైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. ఈ వివరాలను కేరళ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జి మీడియాకు వెల్లడించారు.