హైదరాబాద్, జూలై 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ఆరు యూనివర్సిటీల్లో పీహెచ్డీ ప్రవేశాలకు కామన్ అడ్మిషన్ టెస్ట్ నిర్వహించాలని ఉన్నత విద్యామండలి కీలక నిర్ణయం తీసుకున్నది. ఇందుకు విధివిధానాల రూపకల్పనకు కమిటీని నియమించాలని నిశ్చయించింది. హైదరాబాద్లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో గురువారం డిగ్రీ ప్రవేశాలుసహా అకడమిక్ క్యాలెండర్పై ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి, వైస్ చైర్మన్లు ప్రొఫెసర్ లింబాద్రి, ప్రొఫెసర్ వెంకటరమణ, కళాశాల విద్య కమిషనర్ నవీన్మిట్టల్, కాకతీయ, ఉస్మానియా, తెలంగాణ, పాలమూరు, మహాత్మాగాంధీ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వీసీలు తాటికొండ రమేశ్, డీ రవీందర్యాదవ్, రవీందర్గుప్తా, ఎల్పీ లక్ష్మీకాంత్ రాథోడ్, సీహెచ్ గోపాల్రెడ్డి, సీతారామారావు, ఉన్నత విద్యామండలి కార్యదర్శి డాక్టర్ ఎన్ శ్రీనివాస్రావు తదితరులు పాల్గొన్నారు.
సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలివే..