ఉప్పల్, మే 19 : నియోజకవర్గం అభ్యున్నతికి నిరంతరం శ్రమిస్తామని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. అభివృద్ధి, సంక్షేమానికి తమవంతు తోడ్పాటు అందిస్తున్నామని పేర్కొన్నారు. బుధవారం హబ్సిగూడ డివిజన్ వెంకట్రెడ్డినగర్లో అధికారులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా తాగునీరు కలుషితమవుతుందని కాలనీవాసులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ఈ మేరకు అధికారులతో కలిసి పర్యటించి, సమస్యలను గుర్తించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. లీకేజీని గుర్తించి, పాత పైపులైన్లను తొలగించి, కొత్తగా పైపులైన్ నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు. జలమండలి అధికారులకు లేఖను అందజేశారు. కాలనీలో సమస్యల పరిష్కారానికి యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టాలని, ఆధునిక ప్రమాణాలతో కూడిన నిర్మాణాలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో జలమండలి జనరల్ మేనేజర్ జాన్షరీఫ్, డీజీఎం శ్రీధర్రెడ్డి, ఏఈ సాయిబాబా, నేతలు గడ్డం సాయికిరణ్, గరిక సుధాకర్, శివ, డాక్టర్ చారి, అక్బర్, సాయివెంకట్ తదితరులు పాల్గొన్నారు.
నల్లపోచమ్మ దేవస్థానం ప్రాంగణంలో భక్తుల సౌకర్యార్థం రామంతాపూర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ గంధం జ్యోత్న్సనాగేశ్వర్రావు తన సొంత ఖర్చులతో మౌలిక వసతుల కల్పన పనులు చేపట్టారు. ఈమేరకు ఈ పనులను ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో గంధం నాగేశ్వర్రావు, గడ్డం రవికుమార్, గరిక సుధాకర్, గంగిడి కృష్ణారెడ్డి, గడ్డం సాయికిరణ్, శివ, సాయి, వెంకట్, సమద్, సంధ్య, రాణి తదితరులు పాల్గొన్నారు.
రామంతాపూర్- అంబర్పేట ప్రధాన రహదారిలోని విశాల్మార్ట్ ప్రాంతంలో బుధవారం ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి పర్యటించారు. ఈ ప్రాంతంలో ట్రాఫిక్ రద్దీ నివారణకు చర్యలు చేపట్టాలని ట్రాఫిక్ పోలీసులకు సూచించారు. ట్రాఫిక్ సమస్యలు లేకుండా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గంధం జ్యోత్న్సనాగేశ్వర్రావు, గడ్డం రవికుమార్, గరిక సుధాకర్, సాయికిరణ్, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.