రాయ్పూర్ : ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్ జిల్లాలో నక్సల్స్కు పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. కాల్పుల్లో ఇద్దరు ఇండో టిబెటన్ బార్డర్ పోలీసులు (ఐటీబీపీ) మృతి చెందారు. చోటెడోంగర్ పోలీస్ స్టేషన్ పరిధి కాదేమెట ప్రాంతంలోని ఐటీబీపీ శిబిరానికి సమీపంలో ఈ మధ్యాహ్నం కాల్పులు చోటు చేసుకున్నాయి. 45వ బెటాలియన్కు చెందిన ఐటీబీపీ జవాన్లు పెట్రోలింగ్ విధులు నిర్వహిస్తుండగా నక్సల్స్ తారసపడటంతో ఎదురు కాల్పులు జరిగినట్లు బస్తర్ రేంజ్ ఐజీ సుందరరాజ్ తెలిపారు. నక్సల్స్ కాల్పుల్లో ఐటీబీపీ అసిస్టెంట్ కమాండర్ సుధాకర్ షిండే, ఏఎస్ఐ గురుముఖ్ సింగ్ మృతి చెందినట్లు ఆయన పేర్కొన్నారు. ఘటనాస్థలం నుంచి ఓ ఏకే-47 రైఫిల్, రెండు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు, ఓ వైర్లెస్ సెట్ను నక్సల్స్ అపహరించినట్లు వెల్లడించారు. నక్సల్స్ కోసం భద్రతా దళాలు అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నాయి.