ఢిల్లీ ,జూన్ 4: కశ్మీర్ పర్యటనలో నియంత్రణ రేఖ వెంబడి ఉన్న రక్షణ పరిస్థితులపై సైనికాధిపతి (సీవోఏఎస్) జనరల్ ఎం.ఎం.నరవణె సమీక్షించారు. ఉత్తర సైనికదళం కమాండర్, లెఫ్టినెంట్ జనరల్ జోషి, చినార్ కార్ప్స్ కమాండర్, లెఫ్టినెంట్ జనరల్ డి.పి.పాండేతో కలిసి సీవోఏఎస్ పర్యటించారు. అక్కడి యూనిట్లను ఆయన పరిశీలించారు. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ నుంచి ఉగ్రవాదుల చొరబాట్లను అడ్డుకునేందుకు తీసుకున్న చర్యలను ఆయా యూనిట్ల కమాండర్లు సీవోఏఎస్కు వివరించారు.
సైనికులు చూపుతున్న ధైర్యాన్ని, కార్యాచరణ సన్నద్ధతను సీవోఏఎస్ ప్రశంసించారు. నియంత్రణ రేఖ వెంట ఉన్న ప్రస్తుత ప్రశాంత పరిస్థితిని అభినందించిన సీవోఏఎస్, దేశ రక్షణ విషయంలో ఏమాత్రం అలసత్వం చూపవద్దని, ఎలాంటి సవాలు ఎదురైనా సమర్థవంతంగా ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉండాలని సూచించారు. ఈ ప్రాంతంలో శాంతిని నెలకొల్పడానికి, కొవిడ్ను ఎదుర్కొనడానికి వివిధ ప్రభుత్వ సంస్థలు చేస్తున్న కృషిని కూడా జనరల్ ఎం.ఎం.నరవణె మెచ్చుకున్నారు.