హైదరాబాద్ : టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ ఆధ్వర్యంలో సంఘం నాయకులు డీజీపీ మహేందర్ రెడ్డిని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా పోలీసు శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులకు మెరుగైన జీతాల ఇప్పించేందుకు కృషిచేసిన టీఎన్జీవో నేతలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
డీజీపీని కలిసిన వారిలో టీఎన్జీవో కేంద్ర సంఘం ప్రధాన కార్యదర్శి రాయికంటి ప్రతాప్, అసోసియేట్ అధ్యక్షుడు సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు పర్వతాలు తదితరులున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి