న్యూఢిల్లీ : ఖరీదైన ప్రాంతాల్లో ప్లాట్లు, అపార్ట్మెంట్స్ పేరుతో 20 మందికి పైగా మోసగించిన ఓ రిలయ్ ఎస్టేట్ ఏజెంట్ ను హర్యానా గురుగ్రాంలో పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని ఉత్తరాఖండ్ కు చెందిన నవీన్ చందేలాగా గుర్తించారు. నవీన్ బాధితులను రూ కోటి వరకూ మోసగించాడని పోలీసులు వెల్లడించారు.
తనకు తాను రియల్ ఎస్టేట్ డెవలపర్ గా చెప్పుకున్న నవీన్ గురుగ్రాంలోని పలు ప్రాంతాల్లో కస్టమర్లకు ఫ్లాట్లు చూపించి దాదాపు 24 మంది నుంచి బుకింగ్ అమౌంట్ పేరుతో భారీగా డబ్బు వసూలు చేసి ఉడాయించాడు. ప్రాపర్టీ కొనుగోలుదారుల నుంచి నిందితుడు రూ 1.2 కోట్లు రాబట్టాడని పోలీసులు తెలిపారు. నిందితుడి నుంచి రెండు బంగారు చైన్లు, మూడు గోల్డ్ బిస్కెట్లు, బంగారు గాజులు, హర్యానా డెవలపర్ లైసెన్స్ ను స్వాధీనం చేసుకున్నారు.