న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి పీడ ఇప్పుడప్పుడే విరగడయ్యేలా లేదు. అది రకరకాల రూపాలు సంతరించుకుని జనంపై పంజా విసురుతున్నది. ఇప్పటికే విభిన్న వేరియంట్లలో కరోనా మహమ్మారి ప్రభావం చూపి సద్దుమణుగుతుండగా.. ఇప్పుడు కప్పా వేరియంట్ చాపకింద నీరులా విస్తరిస్తున్నది. తాజాగా ఇవాళ ఉత్తరప్రదేశ్లో రెండు కప్పా వేరియంట్ కేసులు బయటపడ్డాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. గత ఫిబ్రవరి, మార్చి నెలల్లో కూడా దేశంలో కప్పా వేరియంట్ కేసులు వెలుగుచూశాయని, ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో మరో రెండు కేసులు బయటపడటం ఆందోళన కలిగిస్తోందని పేర్కొన్నది. ఇదిలావుంటే, ఇంకా మన దేశంలో ప్రవేశించకున్నా యూరప్ దేశాల్లో మరో కొత్త రకమైన లాంబ్డా వేరియంట్ కలవరపెడుతున్నది.