National
- Jan 14, 2021 , 17:45:20
జల్లికట్టులో నల్లజెండాలు.. పోలీసుల అదుపులో ఇద్దరు

చెన్నై: తమిళనాడులోని మదురైలో పొంగల్ సందర్భంగా సంప్రదాయంగా నిర్వహించే జల్లికట్టులో పాల్గొన్న ఇద్దరు నల్లజెండాలు ప్రదర్శించారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న రైతులకు మద్దతుగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గమనించిన పోలీసులు నల్ల జెండాలు ప్రదర్శించిన ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మదురైలోని పొంగల్ వేడుకల్లో పాల్గొన్న సందర్భంగా ఈ ఘటన జరిగింది.
తమిళనాడులోని ఏఐఏడీఎంకే ప్రభుత్వం కేంద్రంలోని బీజేపీకి బాసటగా నిలుస్తున్నది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ చట్టాలను సమర్థిస్తున్నది. దీంతో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ప్రదర్శనలు, నినాదాలు చేసిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.తాజావార్తలు
- 55 బ్లాక్ స్పాట్లుమియాపూర్, జనవరి 21 : పాదచారుల పాలిట ప్రాణాంతకంగా మారుతున్న బ్లాక్ స్పాట్ల వద్ద రక్షణ చర్యలకు మాదాపూర్ ట్రాఫిక్ సబ్ డివిజన్ అధికారులు నివేదికలను సమన్వయ సమావేశంలో నివేదించారు. ప్రధానంగా మాదాపూర్ ట్రాఫిక్ సబ్ డివిజన్ పరిధిలోని నాలుగు పోలిస్ స్టేషన్ల పరిధిలో 55 బ్లాక్ స్
- ఉగాది నాటికి ‘డబుల్' ఇండ్లు ఇస్తాం
- నియోజక వర్గంలోని అన్ని చౌరస్తాలు అభివృద్ధి
- అంతర్గత రోడ్లకు కొత్తరూపు
- మంచుకొండ.. అభినందనీయం
- అభవృద్ధి పనులు వేగవంతం : ఎమ్మెల్యే ముఠా గోపాల్
- రోడ్డు విస్తరణకు సన్నాహాలు
- ఆకలి తీరుస్తున్న ‘అన్నపూర్ణ’
- కామెడీ ఎప్పుడూ బోర్ కొట్టదు
- మంచిరోజు కోసం..
MOST READ
TRENDING