యాదాద్రి భువనగిరి : కరోనా మహమ్మారి మరోసారి చాపకింద నీరులా విస్తరిస్తున్నది. ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటున్నప్పటికీ కరోనా కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. జిల్లాలోని యాదగిరిగుట్ట పీహెచ్సీ పరిధి తులసి కాటేజ్లో కొవిడ్ మెడికల్ నిర్వహించారు. ఇందులో 312 మందికి టెస్ట్ చేయగా 38 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. వీరిలో 32 మంది ఆలయ ఉద్యోగులు కాగా మిగిలిన వారు యాదగిరిగుట్టకు చెందిన వారని వైద్యులు తెలిపారు.