న్యూఢిల్లీ: ఘజియాబాద్లో ఓ ముస్లిం వ్యక్తిపై దాడి జరిగిన కేసులో యూపీ పోలీసులు ట్విట్టర్ సంస్థకు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ కేసులో వీడియో కాల్ ద్వారా విచారణకు హాజరయ్యేందుకు ట్విట్టర్ ఇండియా మేనేజింగ్ డైరక్టర్ మనీష్ మహేశ్వరి సిద్ధంగా ఉన్నారు. ఈ విషయాన్ని ఆ సంస్థ యూపీ పోలీసులకు వెల్లడించినట్లు తెలుస్తోంది. ఏడు రోజుల్లోగా ఢిల్లీ సరిహద్దు సమీపంలో ఉన్న లోనీ బోర్డర్ పోలీసు స్టేషన్ ముందు హాజరుకావాలని మనీష్ మహేశ్వరికి నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసులకు బదులు ఇస్తూ.. నేరుగా ఆ కేసులో తాను విచారణను ఎదుర్కొలేనన్నారు. ఆయన ఇచ్చిన సమాధానం పట్ల ఘజియాబాద్ పోలీసులు సంతృప్తికరంగా లేరని తెలుస్తోంది. ఈ కేసులో యూపీ పోలీసుల నుంచి ట్విట్టర్కు రెండవసారి నోటీసులు కూడా వెళ్లే అవకాశాలు ఉన్నాయి.