కులకచర్ల, మే 2 : కరోనా బాధితులకు తమవంతు సాయాన్ని అందిస్తున్నామని కులకచర్ల మైత్రి యువజన సంఘం అధ్యక్షుడు చెన్నయ్య అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని ప్యాటగడ్డ కాలనీలో కరోనా బారిన పడ్డ కుటుంబాలకు చెన్నయ్య సొంత డబ్బుతో ఇంటింటికి వెళ్లి గుడ్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో చంద్రలింగం, మైపాల్, జెల్ల నర్సింహులు, గాదె వెంకటేశ్, రమేశ్, శ్రీనివాస్, సురేశ్, సీతారాములు పాల్గొన్నారు.
మందిపల్లో నిత్యావసర సరుకులు అందజేత
మండల పరిధిలోని మందిపల్ గ్రామంలో మాజీ ఎంపీటీసీ, పంచాయతీరాజ్ చాంబర్ రాష్ట్ర కార్యదర్శి వెంకట్, టీఆర్ఎస్ నాయకులు మఠం రాజశేఖర్ కరోనా బాధితులకు నిత్యావసర సరుకులు అందజేశారు. వీరిని ఆదుకోవడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని వారు పిలుపునిచ్చారు. వారి వెంట టీఆర్ఎస్ నాయకులు బాల్రాజ్ పాల్గొన్నారు.