మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం
నాగ్పూర్: మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్ముఖ్పై వచ్చిన అవినీతి ఆరోపణలపై హైకోర్టు రిటైర్డ్ జడ్జి చేత దర్యాప్తు జరిపించాలని ఆ రాష్ట్ర సర్కారు నిర్ణయించింది. ఈ విషయాన్ని అనిల్ దేశ్ముఖ్ ఆదివారం స్వయంగా వెల్లడించారు. ‘నాపై వచ్చిన ఆరోపణలపై రిటైర్డ్ హైకోర్టు జడ్జి చేత దర్యాప్తు జరిపించాలని సీఎం ఉద్ధవ్ ఠాక్రే నిర్ణయించారు. దర్యాప్తు జరిపించాలని నేనే కోరా. దర్యాప్తులో నిజం బయటకు వస్తుంది’ అని అన్నారు. ప్రతినెల రూ.100 కోట్లు వసూలు చేసి ఇవ్వాలని అనిల్ దేశ్ముఖ్ పోలీసులను వేధించేవారని ముంబై మాజీ పోలీస్ కమిషనర్ పరమ్బీర్ సింగ్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా, అనిల్ దేశ్ముఖ్ అనుకోకుండా(యాక్సిడెంటల్) మహారాష్ట్ర హోంమంత్రి అయ్యారని, ఎన్సీపీలో సీనియర్ నేతలు దిలీప్ వాల్సే, జయంత్ పాటిల్ వద్దనుకోవడం వల్లే ఆయనకు ఆ పదవి దక్కిందని శివసేన నేత సంజయ్ రౌత్ అన్నారు. అనిల్ దేశ్ముఖ్పై వచ్చిన ఆరోపణలను అధికార కూటమిలో ఒక్క నేత కూడా ఖండించలేదని శివసేన అధికార పత్రిక సామ్నాలో గుర్తుచేశారు.
ఇవీ కూడా చదవండి
చంద్రుడిపై పరిశోధనా కేంద్రం.. రష్యాతో చేతులు కలిపిన చైనా
సరస్సు నీటి అడుగున పడి.. ఆరు నెలలైనా పనిచేస్తున్న ఐఫోన్