న్యూఢిల్లీ, మే 11: ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ టాటా మోటర్స్ ప్రకటించిన వ్యారెంటీ, ఉచిత సర్వీసులను జూన్ 30 వరకు పొడగిస్తూ నిర్ణయం తీసుకున్నది. ఏప్రిల్ 1 నుంచి మే 31 వరకు ఉన్న సర్వీసింగ్ కాలపరిమితి కలిగిన ప్యాసింజర్ వాహనదారులకు మాత్రమే పొడగించింది. దేశీయంగా సెకండ్ వేవ్ మరింత ఉదృతమవుతున్న నేపథ్యంలో సంస్థ ఈ కీలక నిర్ణయం తీసుకున్నది. లాక్డౌన్ కారణంగా కార్ల నిర్వహణ, సర్వీసింగ్ అందుకోలేని వారికి ఈ అవకాశం కల్పించింది.