పుణె: భారత్ నిర్దేశించిన 318 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ నిలకడగా ఆడుతోంది. క్రీజులో నిలదొక్కుకున్న బెయిర్స్టో యువ బౌలర్ ప్రసిద్ కృష్ణ వేసిన ఆరో ఓవర్లోనే రెచ్చిపోయాడు. ఆ ఓవర్లో రెండు సిక్సర్లు, 2 ఫోర్లు బాది 22 రన్స్ రాబట్టాడు. ఆ తర్వాత బెయిర్స్టో ఎక్కడా జోరు తగ్గించలేదు. అదే ఊపులో 40 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు.
భారత బౌలర్ ప్రసిద్ కృష్ణ 15వ ఓవర్లో జేసన్ రాయ్(46)ను ఔట్ చేసి ఓపెనింగ్ జోడీని విడదీశాడు. తన తర్వాతి ఓవర్లోనే బెన్స్టోక్స్(1)ను పెవిలియన్ పంపి ఇంగ్లాండ్కు షాకిచ్చాడు. 17 ఓవర్లకు ఇంగ్లాండ్ 2 వికెట్లకు పరుగులు చేసింది. ప్రస్తుతం బెయిర్స్టో(81) సెంచరీ దిశగా సాగుతున్నాడు. మరో ఎండ్లో కెప్టెన్ ఇయాన్ మోర్గాన్(0) క్రీజులో ఉన్నాడు.